Monday, January 31, 2011

ఎవరిని నమ్మాలి...



నిజమే... తెలంగాణ విషయంలో ఎవ రిని నమ్మాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఎందుకంటే- ఆ ప్రాంతంలోని ప్రతి పార్టీ తెలంగాణ అంశం గురించి మాట్లాడుతోంది. దాన్ని ఏర్పాటును సమర్థిస్తోంది. ప్రత్యేక రాష్త్రం ఏర్పాటు కోసమే తెరపైకి వచ్చిన TRS పార్టీ ఇపుడు మరింత దూకుడుగా వెళ్తోంది. పనిలోపనిగా పార్టీ పునాదులను బలోపేతం చేసుకుంటోంది. అందుకే ఇతర పార్టీల దిగువస్థాయి నేతలను పెద్ద ఎత్తున పార్టీలోకి చేర్చుకుంటోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా... 50 అసెంబ్లీ, 10 ఎంపీ స్థానాలు గెలవడం కోసం KCR పక్కా ప్లాన్‌ చేస్తున్నారు.

మరోవైపు- అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీతోపాటు... ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీలు ఈ విషయంలో తెలంగాణవాదులను తికమకపెడుతున్నాయి. రెండు నాల్కల ధోరణి అవలంభిస్తూ- సమస్యను జటిలం చేస్తున్నాయి. ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటు ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో మంత్రులు, ఎంపీలు ఎవరికివారే పోటీ సమావేశాలు పెట్టుకుంటున్నారు. పాపం... ప్రజలు ఇది గమనిస్తున్నారని వారికి తెలయదనుకుంటా.

ఇక వామపక్షలు ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. రెండు పార్టీలది చెరోదారి.  మజ్లిస్‌ పార్టీలో ఇంకా క్లారిటీ రాలేదు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను సపోర్ట్‌ చేస్తే ఏం లాభం... చేయకపోతే ఏం నష్టమో తేల్చుకోలేని పరిస్థితిలో MIM నేతలున్నారు. తెలంగాణకు మద్దతు ప్రకటించిన బీజేపీ రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ- ప్రాంతీయత త్వాన్ని సొమ్ముచేసుకోవాలని ఆశపడుతోంది. లోకసత్తా అసలు పార్టే కాదు...

పాపం... చిరంజీవికి సరైన మార్గదర్శకత్వమే కరవైంది. ఎట్లాగూ పార్టీ పోయింది... ఇపుడు సినిమాలూ పోతున్నాయ్‌... అందుకేనేమో... అధికార పార్టీకి అనుకూలంగా మసులుతున్నారు. మేడమ్‌ను కలుస్తున్నారు. పీఎం కూడా అపాయింట్‌మెంట్‌ ఇచ్చేస్తున్నారు. కాంగ్రెస్‌ కూడా చిరు సంకటస్థితిని వాడుకుంటోంది.  జగన్మోహన్‌రెడ్డి  నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని ద్రుష్టిలో పెట్టుకునే కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఈ వ్యూహాన్ని అనుసరిస్తోంది అని చిన్న పిల్లాడిని అడిగినా తెలుస్తుంది.

0 comments:

Post a Comment